Tuesday 11 August 2015

జెండా పీకేసిన జగన్,దుకాణం బంద్...

జెండా పీకేసిన జగన్,దుకాణం బంద్...

 

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ ఆర్ కాంగ్రేస్ అధినేత  వైయస్ జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయనున్నాడంట.,?.ఇక అతని పోరాటం ఒకవైపేనా...?  సంకేతాలు అవుననే వస్తున్నాయి.ఐతే ఆంద్రప్రదేష్ ప్రతిపక్షనేతగా ఉన్న అతను తెలంగాణాలో కూడా పార్టీని పటిష్ట పరచాలని బావించాడు కానీ తెలంగాణాలో అతని ఆటలు నడవకపొయ్యేసరికి తెలంగాణాలో జెండా ఎత్తెయ్యడానికి డిసైడ్ ఐనట్టు సమాచారం.
ఐతే గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో అతను సమైక్యవాదానికే కట్టుబడ్డానిని ఒప్పుకున్నాడు.ఐతే తెలంగాణా పై ఆశలు వదులుకోలేదు కానీ తెలంగాణా లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచింది వైయస్ ఆర్ కాంగ్రేస్ పార్టి.వాటిని కాపాడుకోవడానికి ఇన్నిరోజులు పాకులాడిన ఆపార్టీ అదినేత జగన్ చివరకు తన అసలు రంగు భయటపెట్టాడు.ప్రత్యేకహోదా కోసం దీక్షలో అతను మాట్లాడుతు రాష్ట్రాన్ని విభజించి పాపం చేసారని,రాష్ట్రవిభజన వల్లే ఈ కష్టాలు అని తెలంగాణాపై తన అక్కసును వెలగక్కాడు.దీంతో అతను తెలంగాణాలో అతని పార్టీకి అతనే సమాది కట్టుకున్నట్టైంది.

No comments:

Post a Comment