Monday 10 August 2015

మరో పోటు ఓటుకు నోటు కేసులో బాబుకు

మరో పోటు ఓటుకు నోటు బాబుకు

 

ఓటుకు నోటు కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టై అనంతరం బెయిల్ పైన విడుదలయ్యారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు డిమాండ్ చేయకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసేనని చెప్పడం గమనార్హం.
తన పైన ఉన్న కేసులు ఎక్కడ బయటపడతాయోని చంద్రబాబు కేంద్రంతో రాజీపడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఆయన చిక్కుకుపోయారని మండిపడ్డారు. జగన్ ఢిల్లీస్థాయిలో పదేపదే ఓటుకు నోటు అంశాన్ని ప్రస్తావించడం. ఓటుకు నోటు అంశాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెరపైకి తీసుకు రావడం బాబుకు కొంత ఇబ్బంది పెట్టేలా ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పుడూ బీజేపీని గట్టిగా ఏదైనా అడగాలంటే బాబు జంకుతున్నట్టు సమాచారం.
 
మాయలేడి ప్రాణం చిలకలో ఉన్నట్టు బాబుగారి గుట్టు బీజేపీ చేతిలో ఉన్నట్టు సమాచారం.బాబు ప్రత్యేక హోదాకూడా అడగడానికి వెనకాడటానికి కూడా కారణం ఇదే అని కొందరు అభిప్రాయపడుతున్నరు. బీజేపీని నిలదియ్యకపోవడానికి కూడా కారణం ఇదే అనేది కొందరి వాదన ఏది ఏమైనా ఓటుకు నోటు కేసు బాబుకు పక్కలో బల్లేంలా తయారైంది అనడంలో సందేహం లేదు .

 

No comments:

Post a Comment