Monday 3 August 2015

కొత్త షాక్ ఇవ్వబోతున్న రేవంత్ రెడ్డి !!

కొత్త షాక్ ఇవ్వబోతున్న రేవంత్ రెడ్డి !!


ఓటుకు నోటు కేసులో బుక్కై ఊస‌లు లెక్క‌వెట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొత్తప‌ని పెట్టుకున్న‌రు. సొంత‌ నియోజ‌క‌వ‌ర్గమైన‌ కొడంగ‌ల్ దాట‌వ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో రేవంత్‌కు ప‌ని పాట ఏం లేద‌ట‌. ఇంట్ల నుంచి బ‌య‌ట‌వెళ్ల‌లేని ప‌రిస్థితి,  బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో పాటలు రాస్తున్నట్లు సమాచారం. ఆయ‌న్నే రాస్తే పాట కాస్త ప్ర‌హ‌స‌నం అవుతుంది అన్న భ‌యంతో దగ్గరుండి రాయిస్తున్నట్లు స‌మాచారం.
నల్గొండ జిల్లాకు చెందిన ఓ రచయిత, సింగర్ తో కలిసి ఓ పాటల ఆల్బమ్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీపై తన భావాలను దగ్గరుండి చర్చించి రాయిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు పాటల ఉండే ఈ ఆల్బమ్ లో వివిధ అంశాలను టచ్ చేయబోతున్నడ‌ట రేవంత్. తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా అనే పాటకు కంటిన్యూస్ గా అదేస్ధాయిలో మరో పాట రూపొందిస్తున్నట్లు స‌మాచారం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకోసం ..ఎవరికోసం..అంటూ తెలంగాణలో పార్టీ చరిత్ర..భవిష్యత్ ను కలగలపి మరోపాటను తయారు చేస్తున్నారని స‌మాచారం.

No comments:

Post a Comment