Monday 10 August 2015

ఏపి లో సకలజనుల సర్వే

ఏపి లో సకలజనుల సర్వే

 ఈ కెసిఆర్ ని కాపీ చంద్రబాబు కు బాగా అలవాటైంది.ఇప్పటికే కళ్యాణ లక్ష్మి,,షాదీ ముబారక్ , హరిత హారం,మిషన్ కాకతీయ , వాటర్ గ్రిడ్ పతకాలను కాపీ కొట్టిన చంద్రబాబు తెలంగాణలో చేసిన సకలజనుల సర్వేను కాపీ చేయబోతున్నాడు.
తెలంగాణలో సర్వేను వ్యతిరేకించి ఇప్పుడుదాన్నే కాపీ కొట్టడం విశేషం.ఇప్పటికే ప్రభుత్వం పై చేసిన సర్వ్ ఎదురు తన్నగా ఈ సర్వే ఎలా ఉంటుందో చూడాలి.

ఇదిలా ఉండగా సర్వే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయం వ్యక్తం చేసారు.
కుటుంబాల్లో ఉన్న వ్యాధిగ్రస్తులను పలుకరించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను నిర్వహించడం, అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజల ముందుంచడం, తద్వారా ఈ-ప్రగతిని సాధించడం లాంటి కార్యక్రమాలు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ముఖ్య లక్ష్యాలని ఐవైఆర్ చెప్పుకొచ్చారు.రానున్న రెండు వారాల్లోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్భందీగా నిర్వహించాలని ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.

No comments:

Post a Comment