యూనివర్శిటీ ఇన్ చార్జ్ వీసీ సాంబశివరావు ని తొలగించామని, ఆయన స్థానం లో సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఉదయలక్ష్మి ని నియమించామని వెల్లడించారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్విటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబురావును డిస్మిస్ చేశామని, ఆరోపణలు రుజవైతే ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. కమిటీ సిఫార్సు మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించి ఈ కేసుని అప్పగిస్తామని చెప్పారు. ఈ కేసులో 170 మంది విద్యార్థులను, యూనివర్సిటీ పెద్దలను కమిటీ విచారించిదని మంత్రి గంటా తెలిపారు. పోలీసుల పూర్తిస్థాయి విచారనకు ఆదేశించామని, నిందితులు ఇంకెక్కడా చదువుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
మూడు యాక్టుల కింద రిషితేశ్వరి కేసును విచారిస్తున్నామని మంత్రి గంటా తెలిపారు. ర్యాగింగ్ లో మరికొందరి పేర్లు కూడా ఉన్నట్టు కమిటీ పేర్కొన్నదని తెలిపారు. యూనివర్సిటీ లో అనేక వ్యవస్థల్లో లోపాలు ఉన్నట్టు కమిటి గర్తించిందని మంత్రి గంటా వెల్లడించారు. హాస్టళ్లలో రక్షణ లేదు. పూర్తిస్థాయి వార్డెన్లు లేరు. మూనివర్సిటీలో వ్యవస్థాగత లోపాలు అనేకం ఉన్నాయని కమిటీ గుర్తించిందని చెప్పారు. ఆర్కిటెక్చర్ పరీక్షల్లో ప్రిన్సిపాల్ చేతిలో కొన్ని మార్కులు ఉంటాయి. ఎవరైనా ఫిర్యాదు చేసినా భవిష్యత్ ఏమవుతుందోనన్న భయం విద్యార్థుల్లో ఉందని కమిటీ పేర్కొంది.
No comments:
Post a Comment