అవును చిన్నమ్మ కు పెద్దమ్మ కౌంటర్ ఇచ్చిందంట
లోక్సభ నుంచి 25 మంది పీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వరుసగా నాలుగోరోజు కూడా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.ఈ ఆందోళన లో సోనియాగాంది మన్మోహన్ గాందీతో సహా ముక్యనేతలు పాల్గొన్నరు.ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అంశంపై గురువారం లోక్సభలో కేంద్రమంత్రి సుష్మారాజ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు
సుష్మస్వరాజ్ మాటల గారడిలో ఎక్స్పర్ట్ అని ఆమె విమర్శించింది.లలిత్ మోడీదగ్గర సుష్మా కుటుంబం డబ్బులు తీసుకుందనిఆమె ఆరోపించింది.
లోక్సభలో చిన్నమ్మ మాట్లాడుతూ సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ... తాను కేవలం క్యాన్సర్తో బాధపడుతున్న లలిత్ మోడీ భార్యకు మాత్రమే సహాయం చేశానని, నా స్థానంలో సోనియాగాంధీ ఉంటే ఏం చేసేవారని ప్రశ్నించారు.చిన్నమ్మ ప్రశ్నకు పెద్దమ్మ స్పందించింది.. ఆ స్థానంలో తాను ఉంటే క్యాన్సర్తో బాధపడుతున్న మహిళకు తన వంతు సహాయం చేస్తానే తప్ప... చట్టాన్ని ఉల్లంఘించేదాన్ని కాదని స్పష్టం చేశారు. సుష్మా నాటకీయత ప్రదర్శించారని సోనియా ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment