Monday 3 August 2015
రిషికేశ్వరి కేసులో మరో విద్యార్థి ప్రమేయం?
తాజాగా ఈ ఘటనలో మరో విద్యార్థికి కూడా ప్రమేయముందని పోలీసులు నిర్ధారించారని సమాచారం. ప్రస్తుతం ఆ విద్యార్థి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. ఇక రిషికేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన రోజు రాత్రి నిందితులతో కలిసి ఆమె మంగళగిరిలోని థియేటర్కు సినిమాకు వెళ్లినట్లు ఇది వరకు పోలీసులు చెప్పారు.
అయితే విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్కు వారంతా సినిమాకు వెళ్లారని తాజాగా పోలీసులు గుర్తించారు. సినిమా చూసిన అనంతరం రాత్రి పదకొండు గంటలకు హాస్టల్కు చేరుకున్న రిషికేశ్వరి భోజనం చేసి పడుకుందని తెలుస్తోంది. అయితే విజయవాడ మల్టీప్లెక్స్, ఆ తర్వాత హాస్టల్లో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment