ఒక పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న సంఘటన.
మధుర దగ్గరలో మహేష్ నగర్ అనే ఊరుంది. ఆ ఊళ్లో ఒక పెళ్లి
జరుగుతోంది. పెళ్లి కొడుకు తరఫున చాలామంది బంధువులే వచ్చారు. వారికి
ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. ఆడపెళ్లివారిని తెచ్చిపెట్టమని
కోరారు. ఆ తరువాత, ఇంకా కావాలని అడిగారు. దాంతో చిన్నగా గొడవ స్టార్ట్
అయింది. రెండు వర్గాల బంధువులూ తలో సైడ్ తీసుకున్నారు. పంతాలకు పోయారు.
కొట్లాటకు దిగారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఈ బంధువుల పోరాటంలోకి దిగారు.
అయితే, కొంతమంది మహిళలు పోలీసులపై కూడా రాళ్లు విసరడం
మొదలుపెట్టారు. దాంతో పోలీసులకు బాగా కాలింది! విడదీద్దామని వస్తే
మాపైనే రాళ్లు రువ్వుతారా అంటూ లాఠీలకు పనిచెప్పారు. అందర్నీ తరిమి
తరిమికొట్టారు. దాంతో గొడవ పెరిగి రోడ్లు దిగ్బంధనం దాకా వెళ్లింది.
ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తరువాత, పరిస్థితి
కంట్రోల్ లోకి వచ్చింది.
కానీ, పోలీసులు మాత్రం పంతాన్ని వీడలేదు! ఎవరైతే రాళ్లు రువ్వారో
వారందరిపైనా కేసులు బుక్ చేశారు. అంతేకాదు, ఘటనా స్థలంలో ఓ ఏడుగురిని
అరెస్ట్ చేసి లాకప్లో పడేశారు. మొత్తానికి... ఇలా ఐస్ క్రీమ్ దగ్గర
మొదలైన గొడవ ఏకంగా అరెస్టు వరకూ వచ్చేసింది. చివరికి ఆ పెళ్లి ఇలా
పెటాకులైపోయింది.
No comments:
Post a Comment